1 July, 2026 | 8:11 PM

Breaking News

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •  

వృద్ధ్దురాలి భూమి కబ్జా.. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

05-08-2025 12:00 AM

విచారణ చేపట్టి న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ హామీ

కాగజ్‌నగర్, ఆగస్టు ౪ (విజయక్రాంతి): ఓ వృద్ధురాలు బ్రతికి ఉండగానే చనిపోయినట్లు సృష్టించి తనపై ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటనతో బాదిత వృద్ధురాలు సోమవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది.

చింతల మానపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృత్తురాలు బ్రతికి ఉండగానే చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఇతరుల  పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధిత వృద్ధురాలు తన బిడ్డలతో కలిసి ఆందోళనకు దిగడంతో సిపిఎం నాయకులు ఆనంద్ కుమార్ మద్దతు పలికారు.కార్యాలయం ఎదుట నన్ను చేస్తున్న విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల వృద్ధురాలు వద్దకు వచ్చే పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించింది.