14 April, 2026 | 5:14 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

డీసీసీ అధ్యక్ష పదవికి నేతల ఏకాభిప్రాయం

20-10-2025 01:10 AM

ఆమనగల్లు అక్టోబర్ 19 .డిసిసి అధ్యక్ష పదవి విషయంలో కల్వకుర్తి  కాంగ్రెస్ నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు. హైదరాబాద్ బాలాపూర్ లోని ఓ  ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఎఐసిసి పరిశీలకుడు, తమిళనాడు ఎంపీ రాబర్ట్ బ్రూస్ ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు.

సమావేశానికి ఆమనగల్లు , కడ్తాల, తలకొండపల్లి మండలాల నుంచి డిసిసి అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న   టిపిసిసి సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు భగవాన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి  మిట్టపల్లి అంజయ్య, గిరిజన సేవా సంఘం రాష్ర్ట అధ్యక్షుడు హనుమా నాయక్ లు హాజరయ్యారు.

డిసిసి అధ్యక్ష పదవి విషయంలో పరిశీలకుడు ఒక్కొక్కరి అభిప్రాయ సేకరణ చేసినప్పుడు తమకు అవకాశం కల్పించకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయిళ్ల  శ్రీనివాస్ గౌడ్ కు అవకాశం కల్పించాలని సూచించారు.

అనంతరం రాబర్ట్ బ్రూస్ కు  అందరం  కలిసి తమ అభిప్రాయాన్ని తెలిపినట్లు దరఖాస్తు చేసుకున్న వారు స్పష్టం చేశారు. కాగా ఆమనగలు బ్లాక్  పరిధిలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఏ ఐ సిసి పరిశీల కుడికి ఏకాభిప్రాయం తెలిపినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ్మా తెలిపారు.