13 June, 2026 | 9:36 PM

Breaking News

భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి   •   ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •   వేశ్య కాంతల చెరువు.. తామరచెరువు బేతుపల్లి చెరువులను సర్వే చేయాలి   •  

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

04-11-2025 08:39 PM

సీఐ నాగేశ్వరరావు..

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై, పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ నాగేశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం నాగారం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల భద్రత, రక్షణకు రాత్రి, పగలు, ఎండ, వానలు లెక్కచేయకుండా, కుటుంబాలను వదిలి, అనారోగ్యంతో ఉన్నప్పటికీ విధులు నిర్వర్తించి అలసిపోయి కొద్దిపాటి విరామం తీసుకునే సమయంలో దురుద్దేశపూర్వకంగా అర్వపల్లి పోలీస్ స్టేషన్ గేటు నుండి వీడియో చిత్రీకరించి ఎస్ఐ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, పోలీసుశాఖను అగౌరవపరుస్తూ సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం చేశారన్నారు. వీడియో చిత్రీకరించిన వారిపై, వారిని ప్రోత్సహించిన వారిపై, సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై అర్వపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారిస్తున్నామని చెప్పారు.