calender_icon.png 30 May, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెస్టులు లేవు.. మందులు లేవు!

30-05-2025 12:00:00 AM

  1. దారుణంగా ఖమ్మం వెల్ నెస్ సెంటర్ పరిస్థితి 

ఇబ్బంది పడుతున్న విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులు

చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

ఖమ్మం, మే 28 (విజయ క్రాంతి ): వెల్నెస్ సెంటర్లల్లో అందించే వైద్యమే అంత త.... ఇప్పుడు ఆ అంతంత కూడా కొంతంతైన పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, జర్నలిస్ట్ లకు వైద్య సేవల నిమిత్తం ఒక వెల్నెస్ సెం టర్ ఖమ్మం లోని జిల్లా ప్రభుత్వ అస్పత్రి ప్రాంగణంలో వుంది. ఇక్కడకు చుట్టు ప్రక్క ల వారే కాకుండా వందల కిలోమీటర్ ల నుండి కూడా  వైద్యం పొందెందుకు రోజుకు 150 మంది వరకు పేషెంట్ లు వస్తారు.

ఇక్కడ అవుట్ పేషెంట్ లకు మాత్రమే వై ద్యం అందిస్తారు. చిన్న చితక వ్యాధులకు కా వాల్సిన మందులు ఇస్తారు. టెస్టులు అవసరమైతే టెస్ట్ లు చేసి అనంతరం మందులు అందజేస్తారు.

ఏదయినా పెద్ద వ్యాధులు ఉ న్నట్లయితే నిమ్స్ కు రిఫర్ చేస్తారు.ఇక్కడ స దుపాయాలు అంతంత మాత్రమే వున్న ఉ ద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్ట్స్ లు దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి వైద్యం పొందుతున్నారు.ఇక్కడకు వైద్యం కోసం వ చ్చిన వారికి డ్యూటీ లో వున్న డాక్టర్లు చూసి అవసరమైతే టెస్టులు రాస్తారు లేదా మందులు ఇచ్చి పంపుతారు.

నెల రోజులుగా నో టెస్ట్స్

కానీ గత కొద్దీ రోజులగా ఇక్కడ ఎటువం టి టెస్ట్ లు చేయటము లేరు. దింతో సూ దురా ప్రాంతాల నుండి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబకీలు బాధ తో వెను ది రుగుతున్నారు.ఇక్కడ ఫ్రీ గా పొందాల్సిన టెస్ట్స్ లు వందల రాపాయలు చెల్లించి ప్రవేట్ ల్యాబ్ లల్లో చేపించు కొం టున్నారు. ఇక్కడ అన్ని ఉచితమని సూదురా ప్రాంతాల నుండి చార్జీలు పెట్టుకొని వేస్తే ఇక్కడ ఎటువంటి టెస్ట్స్‌లు చేయకపోవటముతో వారు నిరత్సాహనికి గురవుతున్నారు.

అరకొరగా మందులు

గతంలో చానా వ్యాధులకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేవి. కానీ ఇ ప్పుడు ఆ మందులు కూడా ఎదో కొన్ని త ప్ప మిగతా మందులు అందుబాటులో లేవ ని  చెబుతున్నారు.గతంలో మందులు అయిపోకముందే వచ్చేవని, గత రెండు నెలలుగా మందులు కూడా సరిగ్గా సరఫరా కావడం లేదని చెబుతున్నారు.

దింతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉచిత వైద్యం, మం దులు అని వచ్చిన వారికి తీవ్ర నిరాసే మిగులుతుంది.పెన్షన్ మీద ఆధారపడి కుటుం బం నడుపుకొనే తమకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సదుపాయాలు కూడా సరిగ్గా ఇవ్వడ ము లేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

వసతులు కూడా అంతంతే

వెల్నెస్ సెంటర్ ప్రాంగణం ప్రభుత్వ అ స్పత్రి లోని పాతబడ్డ రూమ్ లల్లో వుంది. వే చి వుండే పేషెంట్ లకు ఫ్యాన్ లు కానీ, మం చి నీటి సౌకర్యాలు కానీ ఇక్కడ లేవు. ఉ మ్మడి జిల్లాకు వున్న ఒక్క వెల్నెస్ సెంటర్ కూడా ఈ విధంగా ఉండటం ఏంటని ఈ హెచ్ ఎస్, జె హెచ్ ఎస్ క్రింద వైద్యం పొం దె వారు ప్రశ్నిస్తున్నారు. వున్నతాధికారులు ఈ సెంటర్ ను సందర్శించి సదుపాయాలు మెరుగు పార్చాలని కోరుతున్నారు.

టెస్టులు, మందులు అందుబాటులో లేవు : నారాయ ణ మూర్తి, జనరల్ ఫిజిషియన్ ఎటువంటి టెస్టులై నా టి హబ్ కి పంపి చేపించే వారమని, టి హబ్ లోని పరికరాల్లో సమస్య తలె త్తడంతో టెస్టులు చేయటము లేదన్నారు.  గత నెల రోజులుగా మందుల కొరత కూడా తీవ్రం గా వుందన్నారు .