13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..

12-01-2026 09:44 PM

పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేస్తాం..

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ

సిద్దిపేట రూరల్: గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాలలోని పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేస్తామని  కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. సోమవారం జక్కాపూర్ గ్రామంలోని శనిగకుంటలో అంగన్వాడీ భవన భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన డిసిసి ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్ తో కలసి మాట్లాడుతూ... తాను గ్రామంలో చేసిన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అంగన్వాడీ భవనం సాంక్షన్ చేయించానని అన్నారు. శనిగకుంట ప్రజల చిరకాల కోరిక అయిన కాలువ నిర్మాణం కూడా రైతులందరు సహకరిస్తే మంత్రి వివేక్ వెంకట స్వామి తో మాట్లాడి, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పార్టీ పాలనలో కనీసం కాలువలను నిర్మించకుండా ఇక్కడి రైతాంగానికి అన్యాయం చేశారని అన్నారు.