13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఫైనల్ ఓటర్ లిస్టును నోటీస్ బోర్డుపై ప్రదర్శన..!

12-01-2026 10:12 PM

మున్సిపల్ కమిషనర్ ఏ.మహేష్ కుమార్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ఓటర్ లిస్టును వార్డుల వారీగా మున్సిపల్ కార్యాలయంలో నోటీస్ బోర్డ్ పై అతికించామని మున్సిపల్ కమిషనర్ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేష్ మాట్లాడుతూ ఇది ఫైనల్ ఓటర్ లిస్ట్ గా ఉంటుందని ఈ ఓటర్ లిస్టును మున్సిపల్ కార్యాలయంతో పాటు తాసిల్దార్ కార్యాలయం, ఆర్డిఓ  కార్యాలయం, దగ్గర ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రజలందరూ ఈ లిస్టును చూసుకొవాలని సూచించారు. మొత్తం ఓటర్ లిస్టు పరిశీలించి ఫైనల్ గా నిర్ణయించి మున్సిపల్ కార్యాలయంలో అతికించామని తెలిపారు  జాబితాను ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వాసంతి, వార్డ్ ఇంచార్జ్ అధికారులు, సూర్య వర్ధన్, అంజన్న, కాశిరాం, గంగాధర్, రాజారెడ్డి, శ్రీకాంత్, సుజాత,, జ్యోతి, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.