06-11-2025 01:59:27 AM
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి): ఎల్ఎల్ఎం రెండో విడత సీట్లను అభ్యర్థులకు బుధవారం కేటాయించారు. 282 కన్వీనర్ కోటా సీట్లలో 277 సీట్లు కేటాయించామని, ఈనెల 7 వరకు సీట్లు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఫేజ్-1లో 915 మందికి సీట్లు కేటాయించగా అందులో 724 మంది ఇప్పటి వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేశారని పేర్కొన్నారు.