03-09-2025 06:22:14 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక తీసుకుంటున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు ప్రోగ్రెస్, ఉపాధి హామీ, సీసనల్ వ్యాధుల నివారణకు చర్యలు, బ్లీచింగ్, ఫాగింగ్, నీరు నిలువ ఉండకుండా చూడడం, నీరు ఉంటే దోమలు ఉండకుండా ఆయిల్ బాల్స్ వేయడం, మలేరియా, డెంగ్యూ మొదలగు వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయుటకు ఏమైనా అవంతరాలు ఉంటే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్హెచ్జీ గ్రూప్ మహిళా సభ్యులకు బ్యాంకు లింకేజి ద్వారా రూ50 వేల వరకు రుణాలు మంజూరు ఇవన్నీ నాటు తెలిపారు.