25 July, 2026 | 10:50 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

కల్యాణ లక్ష్మి – సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

03-09-2025 08:02 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో బుధవారం రోజున ఎమ్మార్వో మారుతి రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా కల్యాణ లక్ష్మి పథకంలో 94 మందికి, సీఎం రిలీఫ్ ఫండ్‌లో 56 మందికి, మొత్తం రూ.1.96 కోట్లు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.

ఏఎంసీ చైర్మన్ కొమ్మిరిశెట్టి విజయ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తుందన్నారు. చెక్కుల మంజూరులో కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.