నిమజ్జన రూట్ ను పరిశీలించిన సబ్ కలెక్టర్
03-09-2025 07:58 PM
అర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలో జరగబోయే గణేష్ నిమజ్జన రూట్ ను ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ పరిశీలించారు. నిమజ్జనం జరిగే గుండ్ల చెరువుల సైతం పరిశీలించారు. ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర రెడ్డి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గణేష్ మండపాలవారు ప్రశాంతంగా శోభయాత్ర నిర్వహించాలని కోరారు.






