13-04-2025 10:13:23 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కాంట్రాక్టర్స్ కాలనీ ఎల్జీఎం చర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం మట్టల పండుగను పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గుడ్ ఫ్రైడే కి ముందు వచ్చే ఆదివారం మట్టలతో యేసు రాజు కు జయ అని నినాదాలతో మార్కెట్ ఏరియా, శాస్త్రి రోడ్, కేఏస్పీ రోడ్, బిసియం రోడ్ మీదుగా నిర్వహించారు.