2 July, 2026 | 1:07 PM

Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్   •   కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   పదేళ్ల అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలి: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •  

కారులో చిన్నారి.. ఊపిరాడక మృతి

11-05-2025 11:10 PM

కడ్తాల్: ఇంటి ముందు పార్క్ చేసిన కారులోకి ఓ చిన్నారి ఎక్కి అందులో నిద్రపోయింది. ఈ ఘటనలో అ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన యాదయ్యకు చెందిన పెద్ద కూతురు అక్షయ (5) వారి సొంతకారులో చర్చికి వెళ్లి తిరిగి ఒంటిగంటకు ఇంటికి చేరుకున్నారు. అందరు కారు దిగిన అనంతరం తర్వాత పెద్ద కూతురు అక్షయ కారు ఎక్కి అందులో పడుకుంది. కారుకు డొరులు వేసి ఉండడంతో ఊపిరి ఆడక మృతి చెందింది. తమ కూతురు కనిపించడంలేదని తల్లిదండ్రులు చుట్టు ముట్టు ఎక్కడ వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో సాయంత్రం వేళల్లో కారులో చూడగా అప్పటికే అక్షయ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.