2 July, 2026 | 12:09 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

మద్దికుంట వద్ద రోడ్డుపై పడిన చెట్టు.. రాకపోకలకు అంతరాయం

11-05-2025 11:04 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట వద్ద రెడ్డి పేట రామారెడ్డి రోడ్డు పై గాలివానకు ఆదివారం సాయంత్రం పెద్ద చెట్టు రోడ్డు కు అడ్డంగా  పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులకు తెలిపిన స్పందించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించాలని మద్దికుంట, రెడ్డి పేట, అన్నారం గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రామారెడ్డి మండలం నుంచి కాకుండా కామారెడ్డి నుంచి వెళ్లే ప్రయాణికులు నిజాంబాద్ జిల్లా సిరికొండ వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగింది. అధికారులు స్పందించి రోడ్డుని క్లియర్ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.