22 April, 2026 | 1:10 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

లక్కీ చాన్స్

28-09-2025 01:38 AM

‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్‌హిట్ సినిమాలతో పాపులారిటీ సంపాదించుకుంది మీనాక్షి చౌదరి. దీంతో వరుస అవకాశాలతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సంక్రాంతికి నవీన్ పొలిశెట్టితో కలిసి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో పలుకరించనుంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఆయన 24వ సినిమాలోనూ ఈ భామే హీరోయిన్. అయితే, మీనాక్షికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం సరసన ‘ఫోర్స్3’ చిత్రంలో మీనాక్షి చౌదరి జత కట్టబోతోందట. భావ్ ధూలియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మీనాక్షి లుక్ టెస్ట్ పూర్తి కావటం, ఆమెను హీరోయిన్‌గా ఫైనల్ చేయడం చకచకా జరిగిపోయానని టాక్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా కోసం మీనాక్షి ప్రత్యేకంగా శిక్షణ కూడా పొందనుందట. షూటింగ్ నవంబర్‌లో ప్రారంభించుకొని వచ్చే ఏడాది థియేటర్లలో వచ్చేలా సన్నాహాలు చేసుకుంటున్నారట ఈ మూవీ టీమ్. మీనాక్షి ఎంపికపై అధికారిక ప్రకటన వెలుడాల్సి ఉంది. ఇదే నిజమైతే మీనాక్షి కెరీర్‌కు మంచి మలుపు అవుతుందంటున్నా సినీ విశ్లేషకులు.