29-07-2025 01:39:31 PM
తదుపరి తేదీ ప్రకటించే వరకు వేచి ఉండలని సూచన
సిరిసిల్ల,(విజయక్రాంతి): మాదిగ ఆత్మీయ సమ్మేళన సభ వాయిదా వేస్తున్నట్టు అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్ తెలిపారు. సిరిసిల్ల పట్టణం లో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... ఈ నెల 30 తారీకు న జరగబోయే మాదిగ ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమం వాయిదా పడ్డదని, కవ్వంపెల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేముల వీరేశం, 9 మంది మంత్రులకు లకు ఢిల్లీ లో అత్యవసర మీటింగ్ కు హాజరు కానుండగా వాయిదా వెయ్యడం జరిగిందని అన్నారు.మళ్ళీ తదుపరి తేదీ ప్రకటించే వరకు నాయకులు, కార్యకర్తలు జిల్లా మాదిగ లకు వేచి ఉండాలని సూచించారు.