3 April, 2026 | 2:03 PM

Breaking News

మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •  

మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించిన మహేష్ గౌడ్

13-10-2025 02:26 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Goud) సోమవారం పరామర్శించారు. మల్లికార్జున ఖర్గే ఆరోగ్య పరిస్థితిని హషేశ్ గౌడ్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు స్టే గురించి ఖర్గేకు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తున్నామనే విషయం కూడా చెప్పినట్లు సూచించారు. వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని స్పష్టం చేశారు. మంత్రులు పోన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ మధ్య వివాదాలు చిన్ని చిన్న అంశాలన్నారు. సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలు జరిగాయని వెల్లడించారు. మంత్రుల మధ్య వివాదాలు చర్చించి పరిష్కరించుకుంటామని మహేశ్ గౌడ్ వివరించారు.