10 June, 2026 | 2:49 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఎంత ఖర్చయినా సరే.. మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం

13-10-2025 04:54 PM

మేడారం పనులు సకాలంలో పూర్తి చేయడమే నా విధి.. 

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..

హైదరాబాద్: మేడారం(Medaram) గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులపై సోమవారం అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అన్ని హంగులతో 90 రోజుల్లో పనులు పూర్తి చేయాలని, మేడారం అభివృద్దికి రూ.212 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ చేశామని అన్నారు.

నిధులు ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని, మేడారంలో భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అభివృద్ది పనులపై అందరి సూచనలు తీసుకుంటూనే ఉంటామని.. కేవలం ప్రాంగణం అభివృద్ది కోసమే రూ.101 కోట్లు కేటాయించామని అన్నారు. ఎంత ఖర్చు అయినా సరే.. మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని.. మేడారం పనులు సకాలంలో పూర్తి చేయడమే నా విధి.. అని మంత్రి పొంగులేటి తెలిపారు.