31-10-2025 12:41:37 AM
 
							ఎస్ఐ విక్రం
నవాబ్ పేట్ అక్టోబర్ 30:స్వతంత్ర సమర యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత్ ఏక్త దివాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించు 2కే రన్ ను విజయవంతం చేయాలని ఎస్త్స్ర విక్రమ్ తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు నవాబ్ పేట్ నుండి 2కె రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నవాబ్ పేట్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నవాబ్ పేట్ మండల ప్రజలుప్రజా ప్రతినిధులకు యువకులకు విద్యార్థులు భారీగా తరలి వచ్చి జాతీయ ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు.