04-12-2025 04:30:33 PM
మఠంపల్లి (విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మంచ్యాతండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన మాలోతు భద్రమ్మ బాబు నాయక్ గురువారం అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి పట్ల స్పష్టమైన దృష్టి, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో ముందుకు వచ్చిన మాలోతు భద్రమ్మ బాబు నాయక్ కు గ్రామస్తులు, కార్యకర్తలు, యువత, పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. నామినేషన్ కార్యక్రమం ఉత్సహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పరిపాలన నా లక్ష్యం, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.