17 April, 2026 | 11:01 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం

24-05-2025 12:20 AM

వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడిన అర్వపల్లి పోలీసులు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. బంధువులు, అర్వపల్లి ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని అడివెంల గ్రామానికి చెందిన రాపర్తి హరీష్ కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని శుక్రవారం సాయంత్రం సమీప బంధువులకు వీడియో కాల్ చేసి చనిపోతున్నానని తెలిపాడు. వెంటనే బంధువులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు.దీనిపై స్పందించిన ఎస్సై తన సిబ్బందితో వెళ్లి ఫోన్ నెట్వర్క్ లొకేషన్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి ప్రాణాలతో రక్షించాడు. అనంతరం కౌన్సిలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. త్వరితగతిన స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులను గ్రామస్తులు అభినందించి,హర్షం వ్యక్తం చేశారు.