24-05-2025 10:15:43 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ ఉమ్మడి మండలాల కార్యకర్తల సమావేశానికి మెదక్ జిల్లా(Medak District) అధ్యక్షులు ఆంజనేయులు విచ్చేసినారు, వీరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మెదక్ జిల్లా ఇన్చార్జ్లు మెట్టు సాయికుమార్, వరప్రసాద్ విచ్చేసి కార్యకర్తల సమస్యలు విని పార్టీలో పనిచేసే కార్యకర్తకు సమన్యాయం చేస్తామని హామీ ఇచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చిటుకుల మైపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, నవీన్ ముదిరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ, సాక్స్ డైరెక్టర్ జావిద్ భాషా, నాగరాజు గౌడ్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.