calender_icon.png 24 May, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్

24-05-2025 12:20:56 AM

యాదాద్రి భువనగిరి మే 23 ( విజయ క్రాంతి ) : గ్రామ పాలన అధికారి పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు  తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  గ్రామ పాలన అధికారి  రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్  తెలిపారు.

భువనగిరి పట్టణంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వెనక ఉన్న వెన్నెల కళాశాలలో ఏర్పాట్లు చేసిన్నట్లు పరీక్ష   ఈ నెల 25న(ఆదివారం ) రోజున నిర్వహించనున్న పరీక్షకు 151 మంది  హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష వ్రాసే వారు పరీక్ష కేంద్రాలకు అర్ధగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు.