31-05-2025 12:26:43 AM
అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలి
అఖిలపక్ష రాజకీయ పార్టీల డిమాండ్
వైరా, మే 30 (విజయక్రాంతి)రోడ్డు వెడల్పు కుదిస్తే సా యం చేది లేదంటూ అక్కలపక్షం నాయకులు హెచ్చరించారు. .వైరా రింగ్ రోడ్ నుండి వైరా ప్రాజెక్ట్ కుడికాలువ వరకు 26 అడుగుల వెడల్పుతో జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులను అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళ న నిర్వహించారు. దీంతో అధికారులు నిర్మాణ పనులను నిలిపివేశారు..
ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి 80 సంవ త్సరాల క్రితం వైరా ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న అప్పటి నుండి నేటి వరకు వైరా రిజర్వాయర్ వెళ్ళు రోడ్డు 100 అడుగులు వెడల్పు ఉంటుందని పూర్వీకులు చెబుతున్నారు. అట్టి రోడ్డుకు నిర్మాణ పనులు ప్రతిపాదించిన ఆనాటి పాలకవర్గం 100 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును 60 అడుగుల వెడల్పుకు కుదించి నిర్మాణ పనులకు ప్రతిపాదనలు పం పించారు.
నిధులు మంజూరై పనులు ప్రారంభించిన,నేటి పా లకులు 60 అడుగుల వెడల్పు రోడ్డును 26 అడుగులకు కు దించి నిర్మాణం చేపట్టారనీ ఆరోపించారు. ఈ రోడ్డుకు ఇరుపక్కలా 10 అడుగుల రోడ్డు బిటి వేయాలని, రోడ్డు మధ్యలో రెండు అడుగులు డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎస్టిమేట్ కాఫీలు ఉన్నట్టు నిర్మాణం చేస్తున్న అధికారు లు, కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో నిర్ణయించిన ప్రకారం అరవై అడుగుల రోడ్డు నిర్మాణం చేయాలని, 60 అడుగుల వెడల్పుతో బౌండరీ రాళ్ళు
ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా డిఇ నరేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపాదన ఇచ్చిన ప్రకారము రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయని అఖిలపక్ష నాయకులకు చెప్పటంతో ప్రస్తుతం జరు గుతున్న పనులు ఇప్పుడు అవసరం లేదని, జరుగుతున్న పనులను వెంటనే ఆపేయాలని, నిర్దిష్టంగా రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల కొలతలు చూపించిన తర్వాతే నిర్మాణం చేపట్టాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు పట్టుపట్టాయి.
దీంతో అధికారులు రోడ్డు పనులను నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు చెరుకూరి చలపతిరావు, సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, సిపిఐ మండల కార్యదర్శి యామాల గోపాలరావు, సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు పారుపల్లి కృష్ణారావు, పట్టణ నాయకులు బొం తు సమత, తదితరులు పాల్గొన్నారు.