16 March, 2026 | 2:56 PM

Breaking News

అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •   ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి   •  

మావోయిస్టుల బంద్ ప్రశాంతం

25-10-2025 12:54 AM

వెంకటాపురం (నూగూరు), అక్టోబర్ 24 (విజయక్రాంతి):   కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తోపాటు, మావోయిస్టుల హత్యాకాండకు నిరసనగా మావోయిస్టులు శుక్రవారం దేశవ్యాప్త బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో మండల కేంద్రంలోని వర్తక, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాదాపుగా దుకాణాలన్నీ మూతపడ్డాయి. మందస్తు జాగ్రత్తగా ఆర్టీసీ సర్వీసులను గురువారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. పోలీసులు వాహనం తనిఖీలను ముమ్మరం చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు బంద్ యధావిధిగా సాగింది.