calender_icon.png 25 September, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవానుగ్రహం అందరిపై ఉండాలి

25-09-2025 12:41:44 AM

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): దైవ అనుగ్రహం అందరి పై ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదార్పల్లి గ్రామంలో దసరా పండుగ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత అ మ్మవారికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలోముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టాణ అధ్యక్షులు శివరాజ్, మాజీ కౌన్సిలర్ అనంత రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.