calender_icon.png 13 June, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెసోళ్లే బాంబులు పెట్టిండ్లేమో!

23-05-2025 01:01:55 AM

  1. బీజేపీవాళ్లేమో ఎన్డీఎస్‌ఏ రిపోర్టు అంటూ తిరుగుతున్నారు..
  2. సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే నోటీసుల డ్రామా
  3. నిర్మల్ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ వారే మేడిగడ్డకు బాంబులు పెట్టి పర్రెలు వచ్చేలా కుట్రలు చేసి తమ ను బాద్నాం చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్ పిల్లర్‌కు చిన్న పర్రె పడితే దాన్ని దాచిపెట్టి మొత్తం ప్రాజెక్టే కూలిందని కాంగ్రెస్, ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్‌తో కాళేశ్వరంపై దుష్ర్పచా రం చేస్తున్న బీజేపీని చూస్తుంటే ఈ అనుమానం ఇంకా బలపడుతోందన్నారు.

ప్రజాసమస్యల నుంచి ప్రజలను పక్కనపెట్టేం దుకే కాళేశ్వరం నోటీసులు అంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ తెలంగాణభవన్‌లో జరిగిన నిర్మల్ జిల్లా బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక్క మనిషే నలుగురులాగా నటించే మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో రేవంత్‌రెడ్డి బాధపడుతున్నాడని ఎద్దేవా చేశారు.

ఓవైపు కాళేశ్వరం కూలిందని అంటూనే ఆ ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మసాగర్, మల్ల న్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకొస్తానని చెప్పుకుంటున్నాడన్నారు. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజినీరింగ్ అద్భుతమని ప్రశం సిస్తుంటే ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం దాని మీద అవాకులుచెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. జూన్, జూలైలో పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 

అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందాలపోటీలా?

వందశాతం రుణమాఫీ ఎక్కడ అయిం దో చూపెట్టాలని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరితే సైలెంట్‌గా ఉన్నారని, రుణమాఫీపై కూడా అసత్యాలే మాట్లాడుతు న్నారని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చింది చారానా వంతు అయితే బిల్డప్ మాత్రం బా రానా వంతు చేసుకున్నారని మండిపడ్డారు. 500మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే అందాల పోటీల్లో రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారని, వానలు పడుతుంటే కల్లా ల్లో వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేతలందరూ సెక్రటేరియట్ చుట్టూ పైరవీలు కోసం తిరుగుతు న్నారని, ఈ ప్రభుత్వం 20%, 30% కమీషన్ల చుట్టూనే తిరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు కావా లంటే పైసలు ఇవ్వాల్సిందేనని మంత్రి సురేఖ చెప్పారని కేటీఆర్ విమర్శించారు. 17నెలల కాలంలోనే కాంగ్రెస్ చేస్తున్న దోపి డీ బాగోతం తెలంగాణలోని ఊరూరుకు చేరిందన్నారు. 

ప్రజల దృష్టి మరల్చడానికే నోటీసులు..

పార్టీ రజతోత్సవ సభ విజయవంతం అయినందుకు, కాంగ్రెస్ అవినీతి బాగోతం, కమీషన్ల దందాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. పాతబస్తీ అగ్నిప్రమాద బాధితులను కలవడానికి తీరికలేని ముఖ్యమంత్రి అందాల పోటీల్లో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.

రాష్ర్టం దివాలా చేసిందని చెప్పే ము ఖ్యమంత్రి అందాల పోటీలకు కోట్లకుకోట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. అపరిచితుడులోని రెమోలాగా సీఎం.. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పు పుట్టడంలేదు, అందరూ దొంగల్లాగా చూస్తున్నారని చెపుతున్నారని, కానీ అదే రేవంత్‌రెడ్డి రూ.1,50,000 కోట్ల అప్పు చేసినా అని అపరిచితుడు రాములాగా అసెంబ్లీలోనే ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు.

రైతుల ఖాతాల్లో టకీటకీమని డబ్బులు పడట్లేదు గాని ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఖాతాలో కాంగ్రెస్ అగ్రనేతల ఖాతాల్లో ఠంచన్‌గా పైసలు పడుతున్నాయని ఆరోపించారు. ఇక్క డ దోచుకున్న పైసలు అక్కడ ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు పంచుతున్నారని, లేకుంటే తనకు పదవి ఉండదన్న సంగతి ఆయనకు తెలుసని కేటీఆర్ ఆరోపించారు. 

కేసీఆర్ ఆనవాళ్లను చూపించుకొస్తున్నారు..

కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని చెపుతున్న సీఎం, అందాల పోటీలకు వచ్చిన వారికి కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, టీహబ్, బుద్ధవనం, యాదగిరిగుట్టకు తీసుకుపోయి చూపించుకొస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 55 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఒక్క ఘనత కూడా లేదా అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ను దొర దొర అని తిట్టినవాళ్లే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డిని దొంగ దొంగ అంటున్నారని ఎద్దేవా చేశారు.  రేవంత్ రెడ్డి కథ ముగిసిందని, అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు పైసల సంపాదన మీద పడ్డారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పోయిన ఇంద్రకరణ్‌రెడ్డికి కనీసం కూర్చోమని చెప్పేవాళ్ళు కూడా లేరని ఎద్దేవాచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం హైదరాబాద్ నుంచి అబ్జర్వర్లను పంపుతామని, ఒక్క ఊరు ఒక్కో నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. పార్టీని నమ్ముకుని ఉండేవాళ్లకు టికెట్లు ఇస్తామని చెప్పారు.

సీఐడీ విచారణ కోరే ధైర్యముందా?

  1. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల కేసును నీరుగార్చారు
  2. కేసు వేసిన నాగంను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు..
  3. కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): పాలమూరు ఎత్తిపోతల పథకంపై న్యాయస్థానం తీర్పు అనుకూలంగా ఇచ్చినట్లు, తామంతా నీతిమంతులమని చెప్పేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేసు వేశారని, ఇప్పుడు ఆయన్ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ఆ కేసు నీరుగార్చేటట్టు, వీగిపోయేటట్టుగా వ్యవహరించారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం విషయంలో తమ నిజాయితీని నిరూపించుకునేందుకు కేటీఆర్ ముందుకురావాలని, ఆయనకు ధైర్యముంటే సీఐడీ లేదా జ్యుడీషియల్ విచారణ కావాలని ప్రభుత్వానికి లేఖ రా యాలని, అప్పుడు అవినీతి ఏ వి ధంగా జరిగిందో బయటపడుతుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎలా పోరాటం చేస్తారని ప్ర శ్నించారు. ఈ కేసు విషయంలో నీతిమంతులమని, చేసిన అవినీతి మాయమైనట్లు కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు.