calender_icon.png 25 July, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల కొరత లేకుండా చర్యలు

24-07-2025 12:30:28 AM

ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ జూలై ౨౩ (విజయక్రాంతి):రైతుల కు ఎరువుల కొరత రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ మినీ ట్యాంక్బండ్ సమీపంలోని గాయత్రి ఫర్టిలైజర్తో పాటు కొండాపూర్ గ్రామంలోని శ్రీ సాయి ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలో ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ప్యాకింగ్ లేబుళ్లు, తయారీదారుల వివరా లు, గడువు తేదీలు, రిజిస్టర్లు, రసీదుల పుస్తకాలను పరిశీలించారు.

అన్ని రికార్డులు సరిగ్గా నిర్వహించాలని, రైతులకు అవసరమైన పరిమాణంలో మాత్రమే ఎరువులు విక్రయించాలన్నారు. ఎరువుల కొనుగోలుకు వచ్చిన రైతులతో మాట్లాడిన కలెక్టర్, వారి సాగు చేసిన పంటలు, భూమి విస్తీర్ణం వివరాలు అడిగి తెలుసుకున్నారు.తనిఖీల్లో జిల్లా వ్యవసాయ శాఖాధికారి అంజి ప్రసా ద్, తహసీల్దార్లు రాజు, సంతోష్, ఫర్టిలైజర్ యజమాని రమేష్ పాల్గొన్నారు.