12-08-2025 01:38:05 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మించనున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్లో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వికాస్రాజ్, శ్రీధర్, సందీప్కుమార్ సుల్తాని యా, ఆర్అండ్బీ అధికారులు, బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం జరుగనున్నది. సమావేశంలో మంత్రులు ఆర్అం డ్బీ, పంచాయతీరాజ్ పరిధిలో నిర్మించే రోడ్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.