17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బాధితులకు కేంద్రం తరపున అండగా ఉంటాం: కిషన్ రెడ్డి

18-05-2025 11:48 AM

హైదరాబాద్: చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ ఘటనాస్థలిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగిందని ఆయనా చెప్పారు. ప్రమాదం చిన్నదే అయినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఫైర్ సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపించారని తెలిపారు.

సహాయక చర్యలు వెంటనే ప్రారంభించి ఉంటే బాగుండేదని, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ సిబ్బందికి సరైన పరికరాలు ప్రభుత్వం అందించాలని, అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన శిక్షణ ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. అలాగే అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరచుకోవాలన్నారు. బాధితులకు కేంద్రం తరపున అండగా ఉండి, భరోసా ఇస్తామని తెలిపారు. బాధితులకు ఆర్థికసాయం అందేలా ప్రధాని మోడీతో మాట్లాడుతానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు