2 July, 2026 | 12:20 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

మిషన్ భగీరథ నీరు రాక ఇబ్బందులు

08-05-2025 12:00 AM

దౌల్తాబాద్, మే 7: ఐదు రోజుల నుండి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీరానగర్ బీఆర్‌ఎస్ నాయకులు ఉప్పరి స్వామి అన్నారు. బుధవారం రాయపోల్ మండలం వీరానగర్ గ్రామంలో  మిషన్ భగీరథ నీరు రావడంలేదని ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్చమైన త్రాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందించడంలేదన్నారు. నీళ్లు రాకపోవడంతో వ్యవసాయ పొలాల నుండి ట్యాంకర్ల ద్వారా తీసుకు వస్తున్నామని అన్నారు.

ఐదు రోజుల నుండి గ్రామానికి నీళ్లు రావడంలేదని మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోవడంలేదన్నారు. అధికారులు గ్రామానికి గతంలో లాగే నీరు సరఫరా అయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరానగర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు..