10-02-2025 12:00:00 AM
చేగుంట, ఫిబ్రవరి 9: చేగుంట పట్టణ కేంద్రంలో ఈనెల14న నిర్వహించే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కి ఉత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు వడ్ల నవీన్ కుమార్, ఎస్టీ సెల్ అధ్య క్షులు ఫకీర్ నాయక్, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు బద్య నాయక్, సండ్రుగు శ్రీకాంత్, సాయి కుమార్ గౌడ్ పాల్గొన్నారు.