15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నాచారం డివిజన్లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

18-12-2025 07:40 PM

ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లోని  భవాని నగర్ ఓల్డ్ విలేజ్ ఎర్రకుంట కాలనీలో సుమారు 71 లక్ష రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం రెండు నెలల కాలంలోనే  సుమారు 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.

నాచారం రైతు బజార్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో పేద మధ్యతరగతి  ప్రజలు శుభకార్యాలు చేసుకోవడానికి వీలుండేలా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ తొందర్లోనే నిర్మిస్తామని ఆయన తెలిపారు.  మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ బాలకృష్ణ అసిస్టెంట్ ఇంజనీర్ వినీత్ వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.