8 March, 2026 | 3:35 PM

Breaking News

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •  

నాచారం డివిజన్లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

18-12-2025 07:40 PM

ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లోని  భవాని నగర్ ఓల్డ్ విలేజ్ ఎర్రకుంట కాలనీలో సుమారు 71 లక్ష రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం రెండు నెలల కాలంలోనే  సుమారు 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.

నాచారం రైతు బజార్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో పేద మధ్యతరగతి  ప్రజలు శుభకార్యాలు చేసుకోవడానికి వీలుండేలా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ తొందర్లోనే నిర్మిస్తామని ఆయన తెలిపారు.  మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ బాలకృష్ణ అసిస్టెంట్ ఇంజనీర్ వినీత్ వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.