15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ

18-12-2025 07:42 PM

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ వైభవంగా ఘనంగా జరిగింది. 29 సార్లు శ్రీ అయ్యప్ప మాల ధరించిన ఆర్ఎంపి వైద్యుడు శంకర్ గురుస్వామి నివాసంలో జరిగిన మహా పడిపూజ కార్యక్రమాలకి భక్తులు భారీగా తరలివచ్చారు. గురుస్వాముల మంత్రోచ్ఛారణలు మధ్య స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. వికారాబాద్ పట్టణానికి చెందిన రవి స్వామి బృందం ఆలపించిన భజన సంకీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామి శరణు ఘోషతో పెద్దముల్ గురువారం మారుమ్రోగింది. భక్తిశ్రద్ధలతో 18 మెట్లపై ఉన్న దీపాలను శంకర్ గురుస్వామి వెలిగించారు. అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.