15 June, 2026 | 2:05 PM

Breaking News

తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •  

సనత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని

27-10-2025 07:20 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సనత్ నగర్ లోని అల్లా ఉద్దిన్ కోటి లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన మేరకు ఆమ్ స్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రారంభించారు.

ఈ శిబిరంలో ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. పేద ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలలో నిర్వహించే వైద్య శిభిరాలతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. బస్తీలోని ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చొరవ తీసుకోవాలని బస్తీ నాయకులకు ఆయన సూచించారు. శిబిరానికి వచ్చిన వైద్యులు, సిబ్బందికి కొలన్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు ఖలీల్, శేఖర్, పురుషోత్తం, బస్తీ నాయకులు కరీం లాలా, ఫాజిల్, వైద్యులు శిరీష, లలిత్, సమీరా తదితరులు పాల్గొన్నారు.