10-07-2025 11:11:24 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha) గురువారం కొత్తగూడెంలో పర్యటించారు. పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో జాగృతి మీటింగ్ అనంతరం పాల్వంచలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పాల్వంచ కో- ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేశారు. కాంపెల్లి కనకేష్ పటేల్ నూతన గృహ నిర్మాణం గృహప్రవేశం చేసిన సందర్భముగా వేరే కార్యక్రమాలు ఉండటంతో హాజరు కాలేకపోయారు. దీంతో గురువారం కల్వకుంట్ల కవిత వారి నివాసానికి విచ్చేసి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.