19-11-2025 01:22:34 PM
కాగజ్నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసం లో పెంచికలపేట్ గ్రామానికి చెందిన సుంకరి భాగ్య, సమీర్, కవితకి సీఎం సహాయనిధి చెక్కును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అందజేశారు. ఈ సందర్భంగాఎమ్మెల్సీ మాట్లాడుతూ... సీఎం సహాయనిధి పథకం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.ఆపద సమయంలో సంజీవినీలా పని చేస్తోందని పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.