1 April, 2026 | 11:57 AM

Breaking News

దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •   కమర్షియల్ గ్యాస్ ‘మంట’.. భారీగా పెరిగిన సిలిండర్‌ ధర   •  

మోదీ నిరాడంబరం

08-09-2025 01:08 AM
  1. ఢిల్లీలో బీజేపీ ఎంపీల వర్క్‌షాప్
  2. చివరి వరుసలో కూర్చున్న ప్రధాని
  3. సాధారణ ఎంపీలా సమావేశానికి హాజరు
  4. జీఎస్టీ సంస్కరణలపై చర్చ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎంత సాదాసీదాగా ఉంటా డో అనేక సందర్భాల్లో రుజువైంది. పార్లమెంట్ ప్రాంగణంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన బీజేపీ ఎంపీల వర్క్‌షాప్ (సంసద్ కార్యశాల)లో కూడా మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. తోటి పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆయన చివరి వరుసలో కూర్చు న్నారు. జీఎస్టీ విధానంలో చేసిన కీలక సంస్కరణలపై ఈ సమావేశం జరిగింది.

జీఎస్టీ సంస్కరణలకు మద్దతుగా బీజేపీ ఎంపీలందరూ తీర్మానాన్ని ఆమోదించారు. సెప్టెంబర్ 3న జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ స్లాబులను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. నేడు ఉపరా ష్ట్రపతి ఎన్నికల కోసం ఎంపీలను సంసిద్ధం చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియ గురించి వారికి వివరించనున్నారు. గోరఖ్‌పూర్ ఎం పీ, బీజేపీ నేత రవికిషన్ ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.