28-06-2025 01:15:06 AM
జూలై 1 నుంచి 10 వరకు పర్యటనలు
న్యూఢిల్లీ, జూన్ 27: భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారంలో ఐదు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మొదటగా ఘనా, టినిడాడ్ అండ్ టుబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో ప్రధాని పర్యటించనున్నారు. జూలై 6 తేదీల్లో బ్రెజిల్లోని రియోడిజనీరోలో బ్రిక్స్ శిఖరాగ్రసదస్సు జరగనుంది. బ్రిక్స్ కూటమిలో భారత్ కూడా సభ్యదేశమే. మోదీ పాలనాకాలంలో అతిపెద్ద విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.