1 April, 2026 | 11:59 AM

Breaking News

దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •   కమర్షియల్ గ్యాస్ ‘మంట’.. భారీగా పెరిగిన సిలిండర్‌ ధర   •  

రైతులకు తప్పని కోతుల తిప్పలు

25-10-2025 12:00 AM

- ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి కోతుల దండయాత్ర 

నంగునూరు, అక్టోబర్ 24: కోతుల చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఆరబెట్టిన ధాన్యంలో కోతులు సయ్యాటలాడుతూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వాటిని అక్కడి నుంచి పంపించడానికి రైతులకు తిప్పలు తప్పలేవు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం, పరిసర గ్రామాల్లో కోతుల బెడద రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోసిన తర్వాత కూడా కాపాడుకోలేని దుస్థితి రైతులకు ఎదురైంది.

చేనులో పంట సాగు చేసినప్పటి నుంచి, పంట చేతికి వచ్చేసరికి కోతుల దండు దాడి చేస్తోంది. మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం కుప్పలపైకి కోతులు సయ్యాటలాడుతూ గుంపులుగా చేరి ధాన్యాన్ని తింటూ, చిందరవందర చేశాయి. రైతులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా కోతులు వారిపైనే దాడికి దిగుతుండటంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నా రు.

పంటను కాపాడుకోవడానికి పడిన కష్టం ఒకవైపు, కోతుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి పడుతున్న భయం అన్నదాతలను వేధిస్తున్నాయి. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి కోతుల బెడద నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.