21-06-2025 08:49:37 PM
ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్
ఖానాపూర్ (విజయక్రాంతి): ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా కాలనీలో, ఇండ్లలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్(Municipal Commissioner Jagdishwar Goud) అన్నారు. దోమల మందు పిచికారి చేయడం ప్రారంభించామని అన్నారు. ఇళ్లల్లో టబ్ లు కొబ్బరి చిప్పలు టైర్ లలో నీరు నిలవ లేకుండా చూసుకోవాలని, శనివారం మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో దోమల మందు పిచికారి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ మేనేజర్ సురేందర్, సైనిటైజేషన్ ఇన్స్పెక్టర్ ఫెరోజ్, సూపర్వైజర్ మానాల శంకర్ పర్యవేక్షిస్తున్నట్టు కమిషనర్ తెలిపారు.