7 May, 2026 | 4:13 PM

సిద్దిపేటలో తల్లి, కూతురు ఆత్మహత్య

11-07-2025 12:04 PM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా(Siddipet District) వార్గల్ మండలం గౌరారం గ్రామంలో శుక్రవారం ఒక మహిళ, ఆమె కుమార్తె పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను వెల్దుర్తి భారతమ్మ (61), కవిత (26)గా గుర్తించారు. వారు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడానికి గల కారణాలు వెంటనే నిర్ధారించబడలేదు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.