7 May, 2026 | 3:13 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

ఐదంతస్తుల భవనం పైనుంచి దూకిన ఇంటర్ విద్యార్థి

11-07-2025 11:20 AM

హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలోని ప్రగతి నగర్‌లో(Pragathi Nagar) శుక్రవారం ఉదయం యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి యువకుడు ప్రాణాలు తీసుకుందామనుకున్నాడు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇంటర్మీడియట్ విద్యార్థి(Intermediate Student) విశాంత్ (18) ఐకాన్ ప్రైమ్ రోజ్ అపార్ట్‌మెంట్స్‌లోని ఐదవ అంతస్తులోని టెర్రస్ నుంచి నేలపై దూకాడు. అతని తల, శరీరంలోని ఇతర భాగాలకు అనేక తీవ్రమైన గాయాలయ్యాయి. అతన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఇతర నివాసితులకు సమాచారం అందించాడు. విషాంత్‌ను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. విశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.