ఐదంతస్తుల భవనం పైనుంచి దూకిన ఇంటర్ విద్యార్థి
హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలోని ప్రగతి నగర్లో(Pragathi Nagar) శుక్రవారం ఉదయం యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి యువకుడు ప్రాణాలు తీసుకుందామనుకున్నాడు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇంటర్మీడియట్ విద్యార్థి(Intermediate Student) విశాంత్ (18) ఐకాన్ ప్రైమ్ రోజ్ అపార్ట్మెంట్స్లోని ఐదవ అంతస్తులోని టెర్రస్ నుంచి నేలపై దూకాడు. అతని తల, శరీరంలోని ఇతర భాగాలకు అనేక తీవ్రమైన గాయాలయ్యాయి. అతన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని ఇతర నివాసితులకు సమాచారం అందించాడు. విషాంత్ను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. విశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.






