calender_icon.png 11 July, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజర్వేషన్ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

11-07-2025 05:54:33 PM

ఎంపీటీసీ ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడిల కుమార్ గౌడ్

నిర్మల్,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీ ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడిల కుమార్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో బిసిపిఎఫ్, బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలలో 42శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని నమ్మపలికి బీసీ ల ఓట్ల ద్వారా గద్దెనెక్కి కాలయాపన చేస్తూ పార్టీ పరంగా ఏస్తమని చెప్పడం బీసీ లను మోసం చేయడమే అన్నారు. హైదరాబాద్ లో జరిగే క్యాబినేట్ సమావేశంలో 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి మొత్తం జనాభా సర్వే నిర్వహించాలని, 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు అవకాశం ఇవ్వాలన్నారు. ఇచ్చిన మాట తప్పి.. ఎన్నికలను జీఓల ద్వారా నిర్వహించాలని చూస్తే బిసి వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ లలో కూడా 42శాతం బీసీలకు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలకు అతీతంగా రాష్టంలోని బిసి సామాజిక ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేసి ఈనెల 15 న ఇందిరా పార్క్ దగ్గర 10 వేల బీసీ బిడ్డలతో బిసి ల మహా ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహా ధర్నా కు బిసి ల నుండి అన్ని సంఘాలు, ప్రజలు, వార్డ్ మెంబర్ నుండి ఎమ్మెల్యే, ఎంపీ ల వరకు రాజకయపార్టీల కతీతంగా ఉమ్మడి నిర్మల్ జిల్లా తో పాటు, రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుండి పెద్దయెత్తున పాల్గొని మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే మరో సకల జనుల సమ్మె తరహాలో మరో ఉద్యమం చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం హైదరాబాద్ లో ఈ నెల 15న ఇందిరా పార్కు వద్ద జరిగే బీసీల మహా ధర్నా వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.