22 June, 2026 | 2:25 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

కవలపిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

15-10-2025 01:08 AM

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

మేడ్చల్, అక్టోబర్ 14(విజయ క్రాంతి): ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ ప్రాణంగా పెంచుకుంటున్న కవల పిల్లలను హత్యచేసి ఆపై ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్ ఫేస్ వన్ లో సాయిలక్ష్మి, అనిల్ కుమార్ దంపతులు నివసిస్తున్నారు.

సాయిలక్ష్మి(27) మంగళవారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో తన కవల పిల్లలైన చేతన్ కార్తికేయ(2), లాస్యవల్లి(2) లను గొంతు నులిమి చంపింది. అనంతరం ఆమె తన నివాసం ఉంటున్న ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా భర్తతో గొడవలు జరుగుతుండ డంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న బాలానగర్ పోలీసులు వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తన్నారు.