17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

కవలపిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

15-10-2025 01:08 AM

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

మేడ్చల్, అక్టోబర్ 14(విజయ క్రాంతి): ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ ప్రాణంగా పెంచుకుంటున్న కవల పిల్లలను హత్యచేసి ఆపై ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్ ఫేస్ వన్ లో సాయిలక్ష్మి, అనిల్ కుమార్ దంపతులు నివసిస్తున్నారు.

సాయిలక్ష్మి(27) మంగళవారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో తన కవల పిల్లలైన చేతన్ కార్తికేయ(2), లాస్యవల్లి(2) లను గొంతు నులిమి చంపింది. అనంతరం ఆమె తన నివాసం ఉంటున్న ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా భర్తతో గొడవలు జరుగుతుండ డంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న బాలానగర్ పోలీసులు వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తన్నారు.