1 July, 2026 | 11:21 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

యోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

09-09-2024 01:12 AM
  1. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ 
  2. ఎమ్మెల్యేలతో కలిసి కొమరంభీం, ఐలమ్మ విగ్రహాల ఆవిష్కరణ

ఆదిలాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): యోధుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమస్యల సాధన కోసం ముందుకు సాగాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. అదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఆధర్యంలో ఏర్పాటు చేసిన కొమరంభీం, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆదివారం ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రి జోగురామన్నలతో కలిసి ఎంపీ ఆవిష్కరించారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరుకావడంతో కార్యక్రమంలో సందడి నెలకొంది.