calender_icon.png 4 September, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వాళ్లకు చేతగాకనే సీబీఐకి ఇచ్చారు: ఈటల

01-09-2025 01:26:17 PM

హైదరాబాద్: కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడంపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Eatala Rajendar) స్పందించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం విచారణ కేసును సీబీఐకి అప్పగించి మంచి పనిచేశారని.. కాంగ్రెస్ వాళ్లకు చేతగాకనే సీబీఐకి ఇచ్చారని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పుల తడక అని.. ఈ రిపోర్టు నిలవదని.. సీబీఐ కాళేశ్వరంపై విచారణ జరిపి అవినీతిని వెలికి తీస్తుందన్న విశ్వాసం తనకి ఉందని పేర్కొన్నారు.