23 March, 2026 | 10:57 AM

ఆరుగురు పిల్లలలో హెచ్‌ఐవి.. విచారణకు ప్రభుత్వం కమిటీ

17-12-2025 09:15 AM

భోపాల్: జార్ఖండ్‌లోని చైబాసా, కోడెర్మాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో రక్తమార్పిడి చేయించుకున్న ఆరుగురు తలసేమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలకు హెచ్‌ఐవి సోకింది. అలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. సత్నా జిల్లాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు సహా రక్త రుగ్మత తలసేమియాతో బాధపడుతున్న ఆరుగురు పిల్లలకు హెచ్ఐవి సోకింది.

పిల్లలలో హెచ్‌ఐవి సోకిన ఘటనపై దర్యాప్తు చేయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించి ప్రజా ఆరోగ్యం, వైద్య విద్య విభాగానికి చెందిన కమిషనర్ తరుణ్ రాఠీ ఉత్తర్వు జారీ చేస్తూ, ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సత్నా, జబల్‌పూర్, ఇతర ప్రాంతాలలోని జిల్లా ఆసుపత్రులలో కలుషితమైన రక్తం ఎక్కించడం వల్ల 12 నుండి 15 ఏళ్ల ఆరుగురు పిల్లలకు హెచ్‌ఐవి సోకినట్లు నిర్ధారణ అయింది. వారిలో ఒకరి తల్లిదండ్రులకు ఈ వ్యాధి సోకినట్లు తేలిందని అధికారులు తెలిపారు.