12-05-2025 12:27:24 AM
కల్లూరు, మే 11 (విజయ క్రాంతి) ఖమ్మం జిల్లా సత్తుపల్లి కల్లూరు మండల పరిధి బత్తులపల్లి గ్రామంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం లో ఆదివారం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రా మ్ సహాయం రఘురాం రెడ్డి పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి,కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.