05-08-2025 12:17:40 AM
ప్రకటించిన టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా టీఎన్జీవో కమిటీ కన్వీనర్గా ఎస్.ఎం.హుస్సేని ముజీబ్ ఎన్నికయ్యారు. పాత కమిటీ కాలపరిమితి జూన్ నెలతో ముగియగా.. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ సోమవారం తా త్కాలిక నూతన కమిటీని ప్రకటించా రు. టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎస్ ఎం హుస్సేని ముజీబ్ను నూతన కమిటీ కన్వీనర్గా, టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వ ర్లును కోఱూ నియమించా రు.
సభ్యులుగా ముత్యాల సత్యనారాయణ గౌడ్, పీ ఈశ్వర్, వీ యశ్వం త్, ఆర్ రంగయ్య, ఎం శ్రీనివాసరావు, ఏ మహేందర్, మాధవ్ గౌడ్, మహ్మద్ అజ్మత్ అలీ, కే.వాణిలను నియమించారు. కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఎస్ఎం హుస్సేని ముజీబ్ ఒక ప్రకటనలో తెలిపారు.