ట్రంప్తో ముఖేష్ భేటీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరైన ముఖేష్ అంబానీ(Mukesh Ambani), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఖతార్ పర్యటన సందర్భంగా ఆయనను కలిశారు. ఈ సమావేశం లుసైల్ ప్యాలెస్లో జరిగింది. ఖతార్ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం అధికారిక విందు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో, ముఖేష్ అంబానీ వివిధ అంశాలపై చర్చిస్తూ డొనాల్డ్ ట్రంప్తో క్లుప్తంగా మాట్లాడారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో కనిపించింది. అంతే అప్పటి నుంచి సోషల్ మీడియా(Social media) ప్లాట్ఫామ్లలో వైరల్ అయింది.
ఈ ఫుటేజీలో, ముఖేష్ అంబానీ అమెరికా వాణిజ్య కార్యదర్శి స్టీవ్ లుట్నిక్తో స్నేహపూర్వక సంభాషణలో పాల్గొంటున్నట్లు కూడా కనిపిస్తుంది. డోనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఖతార్ ప్రభుత్వం(Qatar Government) ఈ అధికారిక విందులో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్తో సహా ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు. జనవరిలో ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖేష్ అంబానీ, డోనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన రెండవ సమావేశం ఇది. ప్రస్తుతం సౌదీ అరేబియా, యుఎఇ, ఖతార్లలో మధ్యప్రాచ్య పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం అవసరమైతే ఇస్తాంబుల్కు వెళ్తానని గతంలో చెప్పారు. అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడం లేదని క్రెమ్లిన్ ప్రకటించిన తర్వాత ఆయన తన గైర్హాజరీని ధృవీకరించారు.






